సంగెం, జూన్ 28 (ఆంధ్రప్రభ): ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ కొడుకు కన్నతల్లి పై పెట్రోల్ (Petrol) పోసి అంటించిన ఘటన ఇవాళ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే… కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద(50) పై తన కొడుకు పెట్రోల్ పోసి అంటించగా, ఇరుగుపొరుగు వారు చూసి ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం డాక్టర్లు (MGM Doctors) 80శాతం శరీరం కాలిపోయిందని నిర్ధారణ చేసి, చికిత్స అందిస్తున్నారు.