హైదరాబాద్ ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్: టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు(Sanitation worker) మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)లో చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్(Gudimalkapur)కు చెందిన రేణుక గత 15ఏళ్లుగా జీహెచ్ఎంసీ(GHMC)లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. ఆదివారం(Sunday) ఉదయం బషీర్ బాగ్(Basheer Bagh) నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డును దాటేందుకు వెళ్తున్న క్రమంలో బషీర్బాగ్ నుంచి వస్తున్న టస్కర్(Tusker) వాహనం ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో.. అక్కడే పనిచేస్తున్న మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆమెను పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్(Gajanand)ను సైఫాబాద్ పోలీసులు(Saifabad Police) అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహిళను మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.