ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు గౌహతి వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రెచ్చిపోయి ఆడుతుంది. ఓపెనర్ జైస్వాల్ (4) విఫలనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా క్రీజులోకి పాతుకుపోయాడు.
పవర్ ప్లేలో సునామీ బ్యాటింగ్తో, 21 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి కిర్రాక్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. సంజు శాంసన్ తో కలిసి నితీష్ రాణా రెండో వికెట్ కు 75 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ప్రస్తుతం 6 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 79/1