Reactor Bomb | సీగాచిలో బ్లాస్ట్ – ప్ర‌మాద స్థ‌లాన్ని పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ

ఉమ్మడి మెదక్ బ్యూరో,  ( ఆంధ్ర ప్రభ): సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని  సీగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు స్థలాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను మంత్రి ఆదేశించారు. వెంటనే పేలుడు జరిగిన ఫ్యాక్టరీ స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.   గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని మంత్రి  ఆదేశించారు.

  ఇక ప్ర‌మాద వార్త తెలిసిన వెంట‌నే  సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్   ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్లలో పాల్గొన్నారు.  క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌రుండి హాస్ప‌టల్స్ త‌ర‌లించారు. ఇక స‌హాయ కార్య‌క్ర‌మాల‌లో హైడ్రా,  ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు పాలుపంచుకుంటున్నాయి.. 

Leave a Reply