ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా నేడు కీలక పోరుకు ఆర్సీబీ సమాయత్తమైంది. ఐసిఎల్ 52వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుండగా.. ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.
హోరాహోరీగా..
ఈ మ్యాచ్లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలవాలని… ప్లేఆఫ్స్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆర్సీబీ చూస్తోంది.
మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ సీఎస్కే… గత సీజన్ లో తమ ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసిన ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ : ఆయుష్ మ్హత్రే, షేక్ రషీద్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి.
ఇంపాక్ట్ ప్లేయర్స్
చెన్నై సూపర్ కింగ్స్: శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: లియామ్ లివింగ్స్టోన్, స్వప్నిల్ సింగ్, మనోజ్ ఎస్ భాండాగే, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ