Rammohan Naidu | రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రి దిగ్భ్రాంతి
Rammohan Naidu | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : తమిళనాడులో రోడ్డు ప్రమాదం పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రామేశ్వరంలో కారును లారీ ఢీకొట్టిన ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా కారును లారీ ఢీకొనటం విచారకరమని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

