AP | మే నెలలో రైతు భరోసా అందిస్తాం – చంద్రబాబు
రాయచోటి – మే నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు . ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేడు ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. ఈ సంబేపల్లి మండలం మోటకట్లలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్ లబ్ధిదారులతో సీఎం మాటామంతీ నిర్వహించారు. సంబేపల్లి క్రాస్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టిందని అన్నారు. భయం అనేది తన జీవితంలో లేదని చెప్పారు. వందదేశాల్లో తన అరెస్ట్కు వ్యతిరేకంగా ఆందోళన చేశారని గుర్తుచేశారు. వర్క్ ఫ్రమ్ హోంను నైబర్హుడ్ హోంగా చేస్తామని స్పష్టం చేశారు. ఏ పంటకు రేటు పడిపోయినా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని తెలిపారు. తంబళ్లపల్లి నుంచి రాయచోటికి కెనాల్ రావాలని అన్నారు. రాయలసీమ ఈ స్థాయిలో ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాయలసీమకు ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ఆరోపించారు. పోలవరానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
రూ. 1000 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి రూ.12వేల కోట్లు మంజూరు చేశారని చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్నారు. గత జగన్ ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందని ఆరోపించారు. అప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తన మాట మీద నమ్మకంతో అమరావతి రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. సంపద వల్ల ఆదాయం వస్తుందని తెలిపారు. 44 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ పెంచిన ఘనత మనదేనని సీఎం తెలిపారు. 2025-26 ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి.. రూ.12వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు.