Breaking : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

రాష్ట్ర‌ప‌తితో మోదీ భేటి
‘ఆపరేషన్ సిందూర్’ వివ‌రాలు వెల్ల‌డి
స‌క్సెస్ తో సాధించ‌డంతో త్రివిధ ద‌ళాల‌కు అభినంద‌న‌లు
రేపే ఢిల్లీలో అఖిల ప‌క్ష స‌మావేశం
క్రొయేషియా, నార్వే, దేశాల మోదీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు
రాత్రంతా వార్ రూంలో ప్ర‌ధాని
ఆప‌రేష‌న్ సిందూర్ ను ప్ర‌త్య‌క్షంగా వీక్ష‌ణ

ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తొలిసారి వీరు సమావేశమ‌య్యారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దాయాది పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. ఆ వివ‌రాల‌ను రాష్ట్ర‌ప‌తికి ప్ర‌ధాని వివ‌రించారు.. విజ‌య‌వంతంగా పాక్ లోని ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన త్రివిద ద‌ళాల‌ను ఈ సంద‌ర్భంగా అభినందించారు రాష్ట్ర‌ప‌తి.. కాగా, రేపు మోదీ అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీల‌కు స‌మాచారం అందించారు..

మూడు దేశాల ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాలలో ఆయ‌న ఈ నెల 13వ తేది నుంచి 17వ తేది వ‌ర‌కు ప‌ర్య‌టించాల్స ఉంది.. పాక్, ఇండియాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు తలెత్త‌డంతో ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.
వార్ రూంలో మోదీ…. ఆప‌రేష‌న్ సిందూర్ పై ప‌ర్య‌వేక్ష‌ణ‌…

ఆప‌రేష‌న్ సిందూర్ కు అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ముహుర్తం నిర్ణ‌యించారు.. దీంతో త్రివిద ద‌ళాల‌కు చెందిన అధిపతులు, ర‌క్ష‌ణ మంత్రి, ప్ర‌ధాని వార్ రూంలో స‌మావేశమ‌య్యారు.. 1.05 కి ప్రారంభ‌మైన దాడిని ప్ర‌త్య‌క్ష్యంగా మోదీ మోనిట‌రింగ్ చేశారు.. ఈ దాడుల‌ను ఆయ‌న ప్ర‌త్య‌క్ష్యంగా తిల‌కించారు.. దాడుల జ‌రుగుతున్న తీరును ఎప్ప‌టి క‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ సూచ‌న‌లు ఇచ్చారు. దాడులు పూర్తి అయిన త‌ర్వాత అయ‌న త్రివిద ద‌ళాల అధిపతుల‌ను అభినందించారు. దాడికి వెళ్లిన విమానాలు, సిబ్బంది సుర‌క్షితంగా తిరిగి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.. రాత్రంతా వార్ రూమ్‌లో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్‌గా ఉన్నారు. మరోవైపు ఈ దాడి వివరాలను భారత ఉన్నతాధికారులు.. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్‌పై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు.

Leave a Reply