PONNAM | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని తెలుసుకొని, సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎన్నారై కమిటీతో సమన్వయం చేసుకుంటూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
PONNAM | సౌదీ ప్రమాదంపై మంత్రి పొన్నం ఆరా.. సంతాపం

