శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ సంభాషణ !

ఆంధ్రప్రభ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా వెల్లడించింది.

శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి మాట్లాడుతూ, “ISSకు చేరుకోవడం ఒక భారతీయుడిగా నాకు గర్వంగా ఉంది. మేమంతా సురక్షితంగా ఉన్నాం” అని ప్రధాని మోదీకి సమాచారం ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “నీవు భూమికి దూరంగా ఉండొచ్చుగానీ, భారతీయుల హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నావు. నీ సాహసం, నిబద్ధత దేశానికి గర్వకారణం. నీవు యువతకు నిజమైన ప్రేరణ” అంటూ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారతీయుల పెరుగుతున్న ప్రాతినిధ్యాన్ని ప్రశంసించారు.

యాక్సియం-4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా ప్రస్తుతం ISSలో ఉన్నారు. ఈ ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణం ద్వారా శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు నిర్వహించబడి, అంతరిక్షంలో భారత్ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లభించింది. ఈ మిషన్ భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది.

Leave a Reply