Peddapalli | ఉగ్ర దాడికి నిరసనగా బంద్

సుల్తానాబాద్ ఆంధ్రప్రభ ఉగ్ర దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బంద్ నిర్వహించారు. శనివారం బిజెపి ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. పట్టణ ప్రధాన దారులన్నీ బోసిపోయాయి. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై ఉగ్ర వాదులు దాడి నిర్వహించి హతమార్చడం హేయమైన చర్య అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రధాని మోడీ దిమ్మతిరిగే సమాధానం చెబుతారన్నారు. ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *