ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు డబుల్ హెడర్ లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సీజన్ లో పంబాబ్ జట్టు తమ హోం గ్రౌండ్ ఆడుతున్న తొలి ఇదే కావడం విషేషం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. బౌలింగ్ ఎంచుకుని రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ఐపీఎల్ 2025 లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్… నేటి మ్యాచ్ తో హ్యాట్రిక్ విన్ పై కన్నేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొంది విజయోత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. ఈ మ్యాచ్ లోనూ గెలిచి టోర్నీలో మరో ముందడుగేయాలని భావిస్తొంది.
ఐపీఎల్ టోర్నమెంట్లలో పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ 28 సార్లు తలపడ్డాయి. ఈ 28 మ్యాచ్లలో పంజాబ్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆర్ఆర్ 16 సార్లు గెలిచింది. దీంతో నేటి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా… లేదా ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానం పదిలం చేసుకుంటుందా అనేది చూడాలి.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ.
పంజాబ్ కింగ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్