Bhupalapalli | విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దుల మృతి

భూపాలపల్లి, జూన్ 19 (ఆంధ్రప్రభ) : జయశంకర్ జిల్లా భూపాలపల్లి (Bhupalpalli) మండలం శ్యాంనగర్ లో రైతు ఇంచర్ల కోటి (Incherla Koti)కి చెందిన నాలుగు దుక్కిటెడ్లు గురువారం విద్యుత్ షాక్ (electric shock) కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామ శివారులో ఉదయం మేత కోసం వెళ్లగా తెగిపడిన 33/11 కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురైనట్లు బాధిత రైతు రోధిస్తూ తెలిపాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply