ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాలతో సత్కరించుకున్న ఇరువురు..
ఉమ్మడి మెదక్ బ్యూరో, జూన్ 16 (ఆంధ్రప్రభ) : ఇటీవల నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari)ని కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu Mudiraj) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) ఆరామ్ ఘర్ లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి పూలబొకే అందించి శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా నీలం మధుని మంత్రి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించి ఇరువురు శాలువాలతో సత్కరించుకున్నారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మన వర్గాల సమస్యలు,ఆర్థికాభివృద్ధి, రాజకీయ అవకాశాలకు కృషి చేద్దామని చర్చించుకున్నారు.