Nandyala | రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

నంద్యాల బ్యూరో ఏప్రిల్ 6 ఆంధ్రప్రభ … నంద్యాల జిల్లా లో శ్రీరామనవమి పండుగ రోజు అయిన ఆదివారం రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థులు చెందిన సంఘటన జరిగింది. జిల్లా లోని కోలిమిగుండ్ల మండలం నందిపాడుకు చెందిన నాగార్జున (16) పదో తరగతి విద్యార్థి బైక్ పై తిమ్మనాయుని పేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలంలో నుంచి దున్నపోతు అడ్డంగా వచ్చి ఢీకొట్టడంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు.

నందిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *