నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 19 (ఆంధ్రప్రభ) : నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డి (Vinay Krishna Reddy)ని ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలు, అభివృద్ధి పనులపై కలెక్టర్ తో ఎంపీ చర్చించారు.
NZB | కలెక్టర్ ను కలిసిన ఎంపీ ధర్మపురి
