Mahbubnagar | అయ్యప్ప నామస్మరణతో…

Mahbubnagar | అయ్యప్ప నామస్మరణతో…

Mahbubnagar | పాలమూరు, ఆంధ్రప్రభ : అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన విఘ్నేశ్వర కాలనీ. ఈరోజు మహబూబ్‌న‌గర్(Mahbubnagar) జిల్లా కేంద్రంలోని మర్లు విజ్ఞేశ్వర కాలనిలో కాలనీ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్(Senior Journalist) గోవర్ధన్ గౌడ్ నివాసంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

కార్యక్రమంలో భాగంగా గణపతి, కుమారస్వామి, జగన్మాత, అయ్యప్ప స్వాములకు గురుస్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబ్నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత హాజరుయ్యారు. అనంతరం అయ్యప్పలకు, భక్తులకు అన్నప్రాసదా వితరణ చేశారు. ఈ పూజలో జిల్లా అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply