ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా.. లక్నో తో తలపడిన ఢిల్లీ 8 వికెట్లతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో.. ఢిల్లీ ముందు 160 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఇక స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢల్లీ.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. లక్నో నిర్ధేశించిన టార్గెట్ ను 17.5 ఓవర్లలో ఛేజ్ చేసింది.
ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ (51), కేఎల్ రాహుల్ (57) అర్ధ శతకాలతో అదరగొట్టారు. ఇక కరుణ్ నైర్ (15) పరుగులకు ఔటవ్వగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (34) పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లలో మార్క్రమ్ రెండు వికెట్లు తీశాడు.
అంతకముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ (52), మిచెల్ మార్ష్ (45) కలిసి ఢిల్లీ బౌలర్లను దంచేశారు. అయితే, పుంజుకున్న డీసీ బౌలర్లు.. వరుసగా వికెట్లు తీసి లక్నోను కష్టాలో పడేశారు.
నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2), కెప్టెన్ రిషబ్ పంత్ (0) కే పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇక డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్), ఆయుష్ బదోని (36) పరువాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ నాలుగు వికెట్లతో విజృంభించాడు. మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.