AP | లారీ – కారు ఢీ .. స్పాట్‌లో ఇద్దరు మృతి

కృష్ణా : ఏపీలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు (Ungutoor) మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్‌కతా (Chennai- Kolkata) జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్ (Vijayawada GGH) కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *