Komatikunta |చెరువులో అయిదుగురు గ‌ల్లంతు … ముగ్గురి మృత‌దేహాలు వెలికితీత …

ఏలూరు – ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. అయితే.. గల్లంతైన ఇద్దరిని వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

చెరువులో పడి..
వివరాల్లోకి వెళితే.. భీమడోలు ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న మార్గమధ్యంలో కాలకృత్యాల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు వారు జారి చెరువులో పడిపోయారు. వర్షాల కారణంగా చెరువులో నీటి మట్టం పెరిగి ఉండడం, మట్టి వానల వల్ల భూమి తడిగా మారి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. పడిపోయినవారిలో ముగ్గురి మృతదేహాలు బయటపడగా.. మిగిలిన ఇద్దరు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. భీమడోలు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

Leave a Reply