- సమవుజ్జీల పోరులో బోణీ కొట్టేదెవరు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో మరో సమరానికి రంగం సిద్దమైంది. ఈరోజు నేడు (బుధవారం మార్చి 26) గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొననుంది. అయితే, ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్లో ఓడిపోయాయి.
ఈ క్రమంలో, ఈరోజు మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ 2025 సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.
దీంతో ఈరోజు మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగుతుంది. కాగా, ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
గౌహతి పిచ్ రిపోర్ట్..
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సహజంగా ఈ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్ల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 200 కి పైనే ఉంది. ఆరంభంలో పిచ్ పేసర్లకు కాస్త సహకారాన్ని అందించవచ్చు. దీంతో ఈ మ్యాచ్లోరూ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ.