Investment | ఏపీలో రూ. 80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

న్యూ ఢిల్లీ – పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ.. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. కొత్త ఢిల్లీలో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని వెల్లడించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని,. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని వెల్లడించారు.. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉంది అని కేంద్ర మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *