భారత మహిళా క్రికెట్ జట్టు లండన్ పర్యటనకు సిద్ధమైంది. ఈ జట్టు లండన్ పర్యటనలో భాగంగా టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని బలమైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
వన్డే, టీ20 మ్యాచ్లకు ఎంపికైన జట్లకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
వన్డే టీం :
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్ నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే.
టీ20 జట్టు :
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే.