IND vs ENG | ఇంగ్లండ్ దూకుడు.. వికెట్ కోల్పోకుండా స్కోరు బోర్డు పరగులు !

లీడ్స్ వేదిక‌గా జరుగుతున్న తొలి టెస్ట్ చివరి రోజు భారత్‌పై ఇంగ్లాండ్ ఓపెనర్లు సత్తా చాటుతున్నారు. ఛేజింగ్‌లో ఆ జట్టు ఓపెనింగ్ జోడి భారత్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ క్రమంలో ఓపెనర్ బెన్ డకెట్‌ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. కేవలం 121 బంతుల్లోనే తన ఆరో టెస్ట్ సెంచరీ (100) నమోదు చేశాడు.

మరో ఎండ్‌లో జోరుగా బ్యాటింగ్‌ చేసిన జాక్ క్రాలీ 119 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఇప్పటికే 40 ఓవర్లలో 178 పరుగులు నమోదు చేసిన ఇంగ్లాండ్‌కు విజయానికి ఇంకా కేవలం 194 పరుగులే కావాల్సి ఉంది.

భారత బౌలర్లు ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. వికెట్ల కోసం శ్రమిస్తున్నా, ఇంగ్లాండ్ ఓపెనర్ల దూకుడు ముందు భారత బౌలింగ్ విభాగం తేలిపోతోంది. ఈ దశలో మ్యాచ్‌పై ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం సాధించినట్లు కనిపిస్తోంది. ఓపెనర్లు కొనసాగితే, విజయానికి చాలా దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. భారత్ కు గెలుపు ఆశలు బతికుండాలంటే త్వరగా వికెట్లు తీసేందుకు మాయాజాలమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Leave a Reply