- బుమ్రా బౌలింగ్లో మెరుపులు
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకున్నాయి. మొదట భారత జట్టు భారీగా 471 పరుగులు స్కోర్ చేయగా, ప్రత్యుత్తరంగా బాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ధీటుగా సమాదానం ఇస్తుంది. వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్ రెండవ రోజు ఆటను 209/3తో ముగించింది.
ఓపెనర్ బెన్ డకెట్ 62 పరుగులతో ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించగా.. ఒలీ పోప్ తనదైన స్టైల్లో (100) నాటౌట్ పరుగులతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మెరుపులు చూపించాడు. అతను 3 కీలక వికెట్లు (3/48) తీసుకొని ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుదించే ప్రయత్నం చేశాడు. డకెట్, జో రూట్ (28), ఓపెనర్ జాక్ క్రాలేను పెవిలియన్కు పంపించాడు.
ఆట ముగిసే సమయానికి హ్యారీ బ్రుక్ (0)-ఓలీ పోప్ (100) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఉదయం వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించాల్సి ఉంటుంది. వీరి భాగస్వామ్యం ఇంగ్లండ్కు అత్యంత కీలకమైనదిగా మారనుంది.
రెండో రోజు ముగింపు స్కోర్ కార్డు:
భారత్ మొదటి ఇన్నింగ్స్: 471
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 209/3 (49 ఓవర్లు)
ఇంగ్లండ్ ఇంకా వెనుకబడి ఉంది: 262 పరుగులు