AP | పెరిగిన మద్యం ధరలు..
ఆంధ్రప్రదేశ్ సర్కార్ మద్యం ప్రయులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్ అనే మూడు విభాగాల్లో మద్యం సరఫరా కానుంది. అయితే, రూ.99 మద్యం, బీరుపై ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది.
గత కొంతకాలంగా మద్యం షాపులు నడిపే వ్యాపారులు తమకు తక్కువ మార్జిన్ రావడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడంతో.. ప్రభుత్వం 14.5% నుంచి 20% వరకు మార్జిన్ పెంచేందుకు అంగీకరించింది. అయితే, ఈ మార్పుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. దీంతో అన్ని కేటగిరీల మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.