ఎండపల్లిలో…
ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. అన్నిగ్రామాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేయడంతో బంద్ సంపూర్ణంగా కనిపించింది.
ప్రజలు స్వయంగా బంద్(Bund)లో భాగస్వామ్యం కావడం విశేషం. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) పెంపు, సామాజిక న్యాయం సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం(State Govt) తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు మద్దతు తెలిపారు.