హైదరా”బాద్‌ షా”

  • టాప్‌-100 సిటీల్లో ఒకటిగా చోటు…
  • 82వ స్థానంలో భాగ్యనగరం
  • 2026 ప్రపంచ అత్యుత్తమ నగరాల జాబితాలో
  • నాలుగు భారతీయ నగరాలకు స్థానం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ప్రపంచంలోని టాప్‌ 100 బెస్ట్‌ సిటీల్లో హైదరా బాద్‌కు చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో భారత్‌కు సంబంధించిన నాలుగు సిటీలకు చోటు దక్కింది. హైదరాబాద్‌ 82 స్థానంలో నిలిచింది. 2026 వరల్డ్‌ బెస్ట్‌ సిటీస్‌ రిపోర్ట్‌ ప్రకారం క్యాపిటల్స్‌ ఆఫ్‌ క్యాపిటల్‌గా పిలువబడే లండన్‌ నగరం వరుసగా 11వ సారి ఫస్ట్‌ ప్లేస్‌ దక్కించుకుంది.

సెకండ్‌ ప్లేస్‌లో న్యూయార్క్‌, మూడో స్థానంలో ప్యారిస్‌, నాలుగో ప్లేస్‌లో టోక్యో, ఐదో స్థానంలో మాడ్రిడ్‌, ఆరో ప్లేస్‌లో సింగపూర్‌, ఏడో స్థానంలో రోమ్‌, ఎనిమిదో స్థానం లో బెర్లిన్‌ నిలిచాయి. మన దేశానికి చెందిన నాలుగు నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ ర్యాంకు సాధించింది. ముంబై 40వ స్థానంలో, ఢిల్లి 54వ స్థానంలో ఉండగా, ఐటీ రంగ సేవల్లో హైదరాబాద్‌కు 82వ స్థానం దక్కింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా ర్యాం కింగ్‌లను వెల్లడించారు.

టెక్‌ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్‌ బేస్‌ వల్ల బెంగళూరు నగరం ప్రపంచ గుర్తింపును సాధించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నోవేషన్‌ కేంద్రంగా ముంబై ప్రాధా న్యం పెరుగుతోందని రిపోర్ట్‌ పేర్కొంది. రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్ఫాస్ట్ర్రక్చర్‌ ఆధారంగా దిల్లీ 54వ ర్యాంక్‌ లో నిలిచిందని నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న కారణంగా హైదరాబాద్‌ 82వ ప్లేస్‌లో నిలిచిందని నివేదిక తెలిపింది.

34 కేటగిరీల్లో పరిశీలన..

వరల్డ్స్‌ బెస్ట్‌ సిటీస్‌ రిపోర్టు సిద్ధం చేయడానికి రెసోనెన్స్‌ కన్సల్టెన్సీ-ఇప్సోస్‌ సంస్థ ప్రధానంగా 34 కేటగిరీలను పరిశీలించింది. లీవెబులిటీ, లవ్‌ ఎబులిటీ, ప్రా స్పరిటీని ప్రధానంగా తీసుకొని విశ్లేషించారు. ఈ అంతర్జాతీయ జాబితాలో ఇ లా మొత్తం 276 నగరాల గుర్తించగా.. భారత్‌ 4 ప్రధాన నగరాలు బలమైన స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. పెరుగుతున్న టూరిజం, అధునాతన సౌకర్యాలు, ఉ న్నత జీవన ప్రమాణాలతో టోక్యో 4వ స్థానం, సింగపూర్‌ 6వ స్థానంలో నిలిచాయి.

విస్తరణ తర్వాత దేశంలోనే పెద్దసిటీ

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల జాబితాలో స్థానం సంపాదించుకున్న హైదరాబాద్‌ రూపు రేఖలు మారనున్నాయి. నిన్న కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా భాగ్యనగరం మారబోతున్నది. హైదరాబాద్‌ శివారులో ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మునిసిపా లిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 150 మునిసిపల్‌ డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి కొత్తవాటి విలీనంతో మూడింతలు పెరగనుంది. నగర పరిధి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జనాభా దాదాపు రెండు కోట్లు ఉంటుంది.

Leave a Reply