నేరడిగొండ, జూన్ 26 (ఆంధ్రప్రభ) : మండల కేంద్రంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. వివరాలిలా ఉన్నాయి… మండలంలోని దర్భతండా గ్రామానికి చెందిన నటరాజ్ (Nataraj) అనే యువకుడికి నిర్మల్ జిల్లా (Nirmal District) మమడ మండలం గయత్ పల్లి గ్రామానికి చెందిన సుజాత (Sujatha) తో గత ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది.
వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. తల్లి చనిపోవడంతో ఆ పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి భర్త మృతురాలు సుజాతను తరుచూ ఇబ్బందులకు గురిచేస్తుండేవాడని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ దూరంలో రాకపోకలు నిలిచాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.