విజయవాడలో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సితార సెంటర్ లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. లోపల గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు హుటాహుటిన ఎగ్జిబిషన్ ప్రాంతానికి చేరుకొని ఫైర్ సిబ్బందితో కలసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.