ఐపీఎల్ 2025 18వ సీజన్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మెరుగులు దిద్దుకుంటుంది. ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా ఈసారి ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు జరగనున్నాయి. 7 లీగ్ మ్యాచ్లతో పాటు రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు కేటాయించారు.
దీంతో స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు.. మెగా టోర్నీ ప్రారంభానికి ముందే మొత్తం స్టేడియంను రినోవేట్ చేస్తామని హెచ్సీఏ తెలిపింది.
రాబోయే 15 రోజుల్లోనే స్టేడియం సీటింగ్, బాక్స్, వాష్ రూమ్స్ సహా అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గురువారం మీడియాకు తెలియజేశారు.
హైదారబాద్ మ్యాచ్ ల షెడ్యూల్ !
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హైదరాబాద్లో రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. దాంతో పాటు మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10 తేదీల్లో ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరగనున్నాయి.
కాగా, మార్చి 2 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ క్యాంప్ ప్రారంభంకానుండగా.. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ ఈసారి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.