GT vs RR | మ‌రోసారి మెరిసిన సుద‌ర్శ‌న్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ !

ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు అహ్మ‌దాబాద్ వేదికగా జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర పోరులో.. గుజ‌రాత్ టైట‌న్స్ భారీ స్కోర్ న‌మోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్.. ఆర్ఆర్ బౌలింగ్ అటాక్ ను ధీటుగా ఎదుర్కుని న‌ర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 217 ప‌రుగులు సాధించింది.

ఈ ఇన్నింగ్స్ లో యువ స్టార్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82) మరోసారి మెరిశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సుదర్శన్ 18.2 ఓవర్ల పాటు క్రీజులో ఉండి జట్టుకు భారీ స్కోరును అందించాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్చర్ బౌలింగ్‌లో 2.1వ ఓవర్‌లో 2 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. అయితే, తరువాత వచ్చిన జోస్ బట్లర్ (36).. ఓపెనర్ సాయి సుదర్శన్ తో కలిసి కీల‌క గుజరాత్ స్కోరును ప‌రుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బ‌ట్ల‌ర్ ఔట‌న త‌రువాత.. షారుఖ్ ఖాన్ (36) తో జ‌త‌క‌ట్టాడు సాయి సుద‌ర్శ‌న్. వీరిద్ద‌రు కిలిసి 3వ వికెట్ కు 62 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆ త‌రువాత వ‌చ్చిన‌ రాహుల్ తెవాటియా (12 బంతుల్లో 24) మెరుపు మెరిపించాడు. ర‌షీద్ ఖాన్ సైతం రెండు బౌండ‌రీలు బాది 4 బంతుల్లో 12 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. దీంతో గుజ‌రాత్ స్కోర్ 200 దాటింది.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షన రెండేసి వికెట్లు పడగొట్టగా.. జాఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలు తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో 218 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో రాజ‌స్థాన్ జ‌ట్టు ఛేజింగ్ ప్రారంభించునంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *