ఆహ్మాదాబాద్ : గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో సత్తా చాటింది. అహ్మదాబాద్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
గుజరాత్ బ్యాటర్లలో ఫోర్లు, సిక్సులతో బౌండరీల వర్షం కురిపించిన జోస్ బట్లర్ (54 బంతుల్లో 11 ఫోర్లు, *97 సిక్సులతో నాటౌట్) ఢిల్లీ బౌలర్లను దంచేశాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ విఫలమైనప్పటికీ.. ఓపెనర్ సాయి సుదర్శన్ (36), ఇంపాక్ట్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (42)తో రాణించారు. జోస్ బట్లర్ – షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ కలిసి 3వ వికెట్కు 69 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19వ ఓవర్లో వచ్చిన రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో *11) నాటౌట్ గా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటర్లలో టాప్ ఆర్డర్ లో అభిషేక్ పోరెల్ (18), కరుణ్ నాయర్ (31), కేఎల్ రాహుల్ (28), కెప్టెన్ అక్షర్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) పరుగులతో రాణించారు. విప్రజ్, ఫెరీరా వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. అశుతోష్ శర్మ (37) ధనా ధన్ బ్యాటింగ్ చేశాడు.
ఈ మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.