విజయవాడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్(Mains) ఫలితాలను విడుదల (released ) చేసింది.
అభ్యర్ధులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు .మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పాల్గొన్నవారి నుంచి అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. మౌఖిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది.
ఇంటర్వ్యూలు (interviews) జూన్ 23 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నట్లు అధికారులు తెలిపారు.మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు గాను గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వేలాది మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. ఈసారి ఏపీపీఎస్సీ ఆలస్యం లేకుండా పరీక్షల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తిచేసి నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం .