నిందితుల నుంచి 3 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ

కాటారం, ఆంధ్రప్రభ : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠా(A gang of thieves)ను పట్టుకున్నట్లు కాటారం డిఎస్పి సూర్యనారాయణ డిఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యజమానినీ ఆర్థికంగా మోసం చేసి, అలాగే మండలంలోని నస్తురుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడి(physical attack) చేసి, దారి దోపిడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

నిందితుల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే(SP Kiran Khere) ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి చింతకాని గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు, ఇద్దరు మగ, ముగ్గురు మహిళలు కాటారం నుండి మేడారం వైపు వెళ్తు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సూపర్ మార్కెట్(supermarket) యాజమానీతో పాటు, ఓ వ్యక్తి పై భౌతిక దాడి చేసి దారి దోపిడి చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్న‌ట్లు తెలిపారు.

ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, నాగపూర్ కు చెందిన పుణ్య బాల బాలచంద్ రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, మహారాష్ట్ర కారేగావ్ కు చెందిన శాంతి విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.3 లక్షల 48 వేల నగదు(Rs. 3 lakh 48 thousand in cash), 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన కాటారం సిఐ ఈవూరీ నాగార్జున రావు, ఎస్సై ఆకుల శ్రీనివాస్, ఎస్సై జక్కుల మహేష్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుల్ లు రాజు, నాగరాజు, రామారావు జంపన్న, ఐటీ కోర్ వేణులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా డిఎస్పీ సూర్యనారాయణ(DSP Suryanarayana) మాట్లాడుతూ.. కాటారం సబ్ డివిజన్ ప్రజలు ఎవరూ దొంగల, మోసగాళ్ల బారిన పడవద్దని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్లు హరీ కుమార్ , గణేష్, లక్ష్మీ రాజ్, హరీష్, జగన్, శిరీష, జ్యోతి, స్వాతి హోం గార్డు తిరుపతి పాల్గొన్నారు.

Leave a Reply