funeral | ముంబయిలోని శివాజీ పార్కులో..

funeral | ముంబయిలోని శివాజీ పార్కులో..
funeral | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : లెజండరీ సింగర్ ఆశా భోస్లే (92) ముంబయి లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కనుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు ముంబయిలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు అధికారలాంఛనాలతో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
