MBNR | మీ ఇండ్ల బిల్లుల కోసం.. అవసరమైతే నా ఇల్లు కూడా అమ్ముతా : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, జూన్ 27 (ఆంధ్రప్రభ) : ఇండ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తారో అంత త్వరగా మీకు మీ అకౌంట్లో బిల్లులు పడతాయని, ఒకవేళ మీకు బిల్లులు పడనియెడల… అవసరమైతే నా ఇల్లు అమ్మైనా మీ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యత నాది అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (vakiti srihari) అన్నారు. తాను ఈరోజు మీ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడుతున్న అంటే నాపైన మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరాభిమానాలకు నేను నా జీవితాంతం అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మీ విధేయునిగా నిరంతరం పనిచేస్తానన్నారు.

రానున్న రోజుల్లో మొత్తం అభివృద్ధి రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. అందులో భాగంగానే నేడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవాళ మధ్యాహ్నం మక్తల్ (Maktal) పట్టణంలోని ఎఎంఆర్ ఫక్షన్ హాల్ లో మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Sikta Pattnaik) తో కలిసి మంత్రి పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టుకోలేని బీద పరిస్థితిలో ఉన్న వారికి, బరకం కప్పుకున్న వారికి, పేదింటి వారికి సొంత ఇంటి కల నెరవేరాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం (People’s government) ఇందిరమ్మ ఇళ్లను ఇస్తోందన్నారు. రానున్న రోజుల్లో మొత్తం అభివృద్ధి రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. అందులో భాగంగానే నేడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.600 కోట్ల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలను మార్చి చూపిస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply