క్రాంతినగర్ సమస్యలు పరిష్కరం కోసం..

క్రాంతినగర్ సమస్యలు పరిష్కరం కోసం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని క్రాంతినగర్ లో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి అంజనేయులు, మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి కాలనీ వాసులు తమ ప్రాంత సమస్యల పై చైర్మన్, కమీషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కౌన్సిలర్ లు పాశికంటి సంపత్, జూకంటి సంపత్ పాల్గొన్నారు.
