కేరళలోని త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్కు చెందిన అత్యాధునిక ఎఫ్ 35 బి లైట్నింగ్ 2( F-35B lightning II ) యుద్ధ విమానం అత్యవసరంగా శనివారం (Saturday ) తెల్లవారుజామున ల్యాండింగ్ అయింది.. . ఈ యుద్ధ విమానం బ్రిటన్కు (Britain) చెందిన హెచ్ ఎం ఎస్ ప్రిన్స్ వేల్స్ కేరియర్ స్ర్టైక్ గ్రూప్ లో (HMS Prince of Wales)భాగంగా ఉంది.. ప్రస్తుతం ఈ వాహక నౌకా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లలో పాల్గొంటోంది. ఇటీవలే భారత నౌకాదళంతో సంయుక్త సముద్ర విన్యాసాలు పూర్తి చేసిన ఈ దళం, భారత సముద్ర ప్రాంతంలో సంచరిస్తున్నది..
ఈ మోడల్ జెట్ ఫ్లైట్ ప్రత్యేకంగా షార్ట్ టేక్-ఆఫ్, వెర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యంతో రూపొందించబడింది. ఇవి క్యాటపుల్ట్ లేని వాహక నౌకల మీద కూడా ల్యాండ్ కావచ్చు. అయినా సరే, ఈ ఘటనలో విమానం ఎందుకు విమాన క్యారియర్ పై ల్యాండ్ చేయలేకపోయిందనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం ప్రకారం, వాహక నౌక వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అక్కడ ల్యాండింగ్ సాధ్యపడకపోయి ఉండవచ్చని అంటున్నారు.
ఈ విమానాన్ని అమెరికాకు చెందిన డిఫెన్స్ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ మల్టీ-రోల్ యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. స్టెల్త్ లక్షణాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, డేటా షేరింగ్ వ్యవస్థ వంటి అధునాతన సాంకేతికతలతో ఇది అమెరికా, US, బ్రిటన్, UK, ఇజ్రాయెల్ (Isreal ) , నాటో NATO దేశాల వాయుసేనలకు ప్రధానంగా ఉపయోగపడుతోంది. తాజా సమాచారం ప్రకారం విమానాన్ని త్రివేంద్రం విమానాశ్రయ సురక్షిత పరిధిలో పార్క్ చేశారు. ఈ సంఘటనపై బ్రిటన్, భారత రక్షణశాఖలు సమగ్ర సమాచారం సేకరిస్తున్నాయి.