హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు (Inter Board) కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Inter Advanced Supplementary Examination ) మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సహా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాశారు. దీంతో ఈ సారి ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.
TG | ఎల్లుండి ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు
