Donation | ఈరన్నస్వామి దేవాలయానికి భూమి విరాళం

కౌతాళం (ఆంధ్రప్రభ) – శ్రీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు చెల్లించే ప్రతి రూపాయీ భక్తుల సౌకర్యాల కోసమే ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ మేడిపల్లి విజయరాజు తెలిపారు. ఉరుకుందలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్ణాటకలోని బళ్లారి పట్టణానికి చెందిన భక్తుడు బి.తిప్పయ్య ఉరుకుందలోని ఒక ఎకరా 11 సెంట్ల భూమిని దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్ చేసి విరాళంగా అందజేశారన్నారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి దేవస్థాన యాజమాన్యం అనేక అభివృద్ధి. నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

పుణ్యక్షేత్రం పరిసరాల్లో తాగునీటి సౌకర్యార్థం రూ.40 లక్షలతో రెండు వాటర్ సంపుల నిర్మాణ పనులు ఆర్బ్ల్యుఎస్ అధికారుల సౌజన్యంతో వేగంగా సాగుతున్నాయని చెప్పారు. క్షేత్రంలో నిత్యాన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో విశాలమైన అన్నదాన సత్రం నిర్మాణానికి రూ.2.30 కోట్లతో (జి ప్లస్ టు) నిర్మాణ పనులు చేపడతామన్నారు. భక్తులకు ఎండ, వర్షంలో ఇబ్బంది పడకుండా దేవస్థానం లోపల నవగ్రహ మండపం వద్ద భక్తులు, దేవస్థానం భాగస్వామ్యంతో కలర్ కోటెడ్ షీట్స్త5 షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో భక్తుల కాలికి మట్టి అంటకుండా తూర్పు రాజగోపురం ముందు సిసి ఫ్లోరింగ్, సిసి పేవర్లతో ఫ్లోరింగ్ ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు.

ఇప్పటికే ఉన్న 48 టాయిలెట్లకు తోడు అదనంగా కల్యాణకట్ట వద్ద 24 టాయిలెట్లు కేవలం మహిళల కోసం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూగజీవులకు భక్తుల దాతృత్వంతో గోశాల విస్తరణ పనులు ఇద్దరు దాతల సహకారంతో రూ.13 లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు. పుణ్యక్షేత్రానికి 70.24 ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం దేవాలయానికి 24.31 ఎకరాల భూ మాత్రం ఆధీనంలో ఉందని తెలిపారు. అన్యాక్రాంతమై భూమికోసం రెవెన్యూ అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. ఆ భూమి కూడా రెవెన్యూ అధికారుల ద్వా స్వాధీనం చేసుకొని అభివృద్ధి కార్యక్రమా చేపడతామన్నారు.పర్యవేక్షకులు వెంకటేష్, ప్రధా అర్చకులు ఈరప్ప స్వామి, ఉప ప్రధాన అర్చకులు మహడె స్వామి, సీనియర్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *