DNT SCHOOL| ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా..

DNT SCHOOL| ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా..

DNT SCHOOL| ఏటూరు నాగారం, ఆంధ్ర ప్రభ : ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయింపల్లీ గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో నల్లబోయిన నాగార్జున ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని, ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రచారం నిర్వహించరు. గ్రామంలో తాగునీటి, వీధి దీపాలు, డ్రైనేజీ శుభ్రపరచడం, కోతుల బెడద, DNT స్కూల్ కాంపౌండ్, ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై చర్యలు తీసుకోవడం, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని చెప్పారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు.

Leave a Reply