అహ్మాదాబాద్ – ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. భారీ విస్ఫోటనం సంభవించడంతో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలంలో మాంసం ముద్దలు మాత్రమే లభించాయి. దీంతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఎ టెస్టులు చేస్తున్నారు. వీటి ఆధారంగా మృతులను గుర్తించి, ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 24 మంది మెడికోలు కూడా ఉన్నారు మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
DNA Tests | మృతులను గుర్తించేందుకు డిఎన్ఎ పరీక్షలు
