DK Balaji | శ్రమదానం చేసిన కలెక్టర్
ఉద్యోగులతో కలిసి పరిసరాలు పరిశుభ్రం కార్యక్రమం
DK Balaji | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ (Collectorate) ప్రాంగణంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి చెత్తా చెదారాన్ని ఏరి పారేశారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం,వాయు కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్కు ఉద్యోగులందరూ నడక, లేదా సైకిల్పై రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్కు సైకిల్ పై వచ్చారు.

