న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. ఇక నేటి సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ), పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఐఐ సభ్యులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు వస్తారు. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని శనివారం రాజమండ్రి పర్యటనకు వెళతారు.
ఢిల్లీలో సీఎంకు టీడీపీ నేతల స్వాగతం..
సీఎం చంద్రబాబు నాయుడు కడపలో మూడు రోజుల మహానాడు కార్యక్రమాలు ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్తో సహా పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసం వన్జన్పథ్కు ముఖ్యమంత్రి వెళ్లారు.