తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శుక్రవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ముఖ్య నాయకులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కుల గణన అంశంపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరుగుతుందని సమాచారం. కుల గణనపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధానాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.