బండ్లగూడ : ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని మట్టుబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులైన సిద్ధార్థ రెడ్డి, సాయి కార్తీక్ మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది.
గురువారం అర్ధరాత్రి వీరు బుద్వేల్లో ఉన్న ఓ గదిలో మద్యం సేవించారు. గతంలో సిద్ధార్థ రెడ్డి వద్ద సాయి కార్తీక్ రూ. 8లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బుల విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో సాయి కార్తిక్పై సిద్ధార్థ రెడ్డి దాడి చేయడంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.