CONSULTION| బాధిత కుటుంబాలకు పరామర్శ

CONSULTION| కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన శ్రీపాద రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్త అబ్దుల్ ఖాదర్ కు ఇటీవల ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, నూకల బుచ్చి మల్లయ్య, సళ్లురి గణేష్ గౌడ్, శివసారం గణేష్ దులుర్ కిషన్, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply