తిరువూరు – సరైన కోరం లేక గడిచిన రెండు దఫాలుగా వాయిదా పడిన చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరువూరు మున్సిపల్ కౌన్సిల్లో పదిమంది వరకు వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, వీరిలో ఇప్పటికే ఆరుగు తెలుగుదేశం పార్టీలోకి రాగా మరో నాలుగు నుండి ఐదుగురు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, నియోజకవర్గానికి ఖర్చు చేస్తున్న నిధులు వంటి వాటికి ఆకర్షితులై కొందరు కౌన్సిలర్లు రాజకీయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే వీరి నిర్ణయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ పెద్దలు వీరిని నిర్బంధించి బెంగళూరు వంటి ప్రాంతాలకు క్యాంప్ రాజకీయాలకు తరలించినట్లు ఆరోపించారు. వీరిని భయభ్రాంతులకు గురిచేసి ప్రలోభాలకు సైతం గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్న ఆయన ఎప్పుడు ఎన్నిక జరిగిన చట్ట ప్రకారం భవిష్యత్తులో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధమా వ్యక్తం చేశారు.