Breaking |రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ : ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి రైతునేస్తం (Raithu Nestham) కార్యక్రమం ప్రారంభించారు. ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి మరో 1034 రైతువేదికల్లో రైతునేస్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదలుపెట్టారు. రైతునేస్తం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని, వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao), పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభకు వివిధ ప్రాంతాలకు చెందిన 1500మంది రైతులు హాజరయ్యారు. ఇప్పటికే 566 రైతువేదికల్లో ఈ కార్యక్రమం ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్​ (Video conference) సదుపాయం కల్పించారు. ప్రతి మంగళవారం రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో రైతులు ప్రత్యక్షంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఏవైనా సందేహాలుంటే వాటిని అర్థమయ్యే విధంగా చెప్తారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు వంటి అంశాలు రైతులకు వ్యవసాయ శాఖ, వర్సిటీ వారు తెలియజేస్తున్నారు.

Leave a Reply